శ్రీశైలానికి భారీగా వరద

ABN , First Publish Date - 2020-08-10T09:55:27+05:30 IST

ఎగువ రాష్ట్రాలలో భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఆదివారం సాయంత్రానికి 94 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పైన ఉన్న జూరాలకు 2.27 లక్షల

శ్రీశైలానికి భారీగా వరద

కర్నూలు, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఎగువ రాష్ట్రాలలో భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఆదివారం సాయంత్రానికి 94 టీఎంసీల నీరు  నిల్వ ఉంది. పైన ఉన్న జూరాలకు 2.27 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 28 గేట్లు ఎత్తి 2,23,948 క్యూసెక్కులను శ్రీశైలం, పరిసర కాలువలకు విడుదల చేస్తున్నారు. ఇందులో 2,13,486 క్యూసెక్కులు డ్యాంకు చేరుతున్నాయి. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 856 అడుగుల వద్ద 94.68 టీఎంసీల నిల్వలు నమోదు అయ్యాయి.  పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-08-10T09:55:27+05:30 IST