దోమకొండలో భారీ అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2020-04-09T11:14:10+05:30 IST

మండలంలోని టెలీఫోన్‌ బీడీ కంపెనీకి సంబంధించిన బీడీ ఆకు గోదాంపై మంగళవారం రాత్రి పిడుగుపడి

దోమకొండలో భారీ అగ్ని ప్రమాదం

దోమకొండ, ఏప్రిల్‌ 8 : మండలంలోని టెలీఫోన్‌ బీడీ కంపెనీకి సంబంధించిన బీడీ ఆకు గోదాంపై మంగళవారం రాత్రి పిడుగుపడి నిప్పంటుకుంది. దీంతో ఎస్సై రాజేశ్వర్‌గౌడ్‌, ఏఎస్సై ఉమేశ్‌ సంఘట నా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిక్షించారు. కా మారెడ్డి ఫైర్‌ ఆఫీసర్‌ దత్తు మంటలను ఆర్పే ప్ర యత్నం చేయగా.. మంటలు అదుపులోకి రాకపోవ డంతో రామాయంపేట్‌ నుంచి డబుల్‌ ఫైరింజన్‌ తెప్పించి మంటలను ఆర్పారు. అధికారులు తెలిపి న ప్రకారం గోదాంలో సుమారు రూ.25లక్షల విలు వైన ఆకు సంచులు ఉండడగా.. రూ.12లక్షల వర కు ఆస్తి నష్టం జరిగింది. ఈ కార్యక్రమంలో లింబా ద్రి, సామ్రాట్‌, సాయిలు, రంగారావు, రామారావు,  ఫైర్‌ సిబ్బంది శ్రీనివాస్‌, కిరణ్‌ కుమార్‌, బాల్‌రాజ్‌ లక్ష్మణ్‌, స్టాలిన్‌, సంతోష్‌ కుమార్‌, నరేందర్‌రావు, రమేశ్‌, పంచాయతీ కార్యదర్శి సౌజన్య పాల్గొన్నారు.

Updated Date - 2020-04-09T11:14:10+05:30 IST