ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
ABN , First Publish Date - 2021-04-21T17:54:41+05:30 IST
అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి రూ.6.3 కోట్ల విలువైన హెరాయిన్ను తరలిస్తున్న నిందితుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వస్తున్న వ్యక్తిపై అనుమానం రావడంతో అతడిని కస్టమ్స్ అధికారులు అడ్డగించారు. నిందితుడి బ్యాగ్ స్కానింగ్ చేయండంతో హెరాయిన్ గుట్టు బయటపడింది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.