వాడపల్లికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2022-04-04T07:07:08+05:30 IST
కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ రాషా్ట్రల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
- స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.1.91 లక్షలు
ఆత్రేయపురం, ఏప్రిల్ 3: కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ రాషా్ట్రల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి ఒక్కరోజు ఆదాయం రూ.1,91,840 లభించినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.