ఆనందయ్య మందు కోసం బారులు

ABN , First Publish Date - 2021-06-11T11:44:49+05:30 IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో..

ఆనందయ్య మందు కోసం బారులు

ఒంగోలు(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లాయర్‌ పేటలోనూ, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోనూ ఆనందయ్య మందు పంపిణీని గురువారం చేపట్టారు. నియోజకవర్గ ప్రజలందరికీ మందు అందిస్తామని ప్రకటించినప్పటికీ ఒక్కోచోట కేవలం 5వేల ప్యాకెట్లు మాత్రమే పంచారు. ముందుగానే కూపన్లు ఇచ్చినా ఉపయోగం లేకుండాపోయింది. భారీగా తరలివచ్చిన ప్రజలు గంటల తరబడి క్యూలలో ఉన్నప్పటికీ మందు అందకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.      

Updated Date - 2021-06-11T11:44:49+05:30 IST