విజయవాడలో భారీగా గంజాయి సీజ్
ABN , First Publish Date - 2020-09-23T22:17:49+05:30 IST
విజయవాడ నగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖ ఏజెన్సీ నుంచి తమిళనాడు కోయంబత్తూరు తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు
విజయవాడ: విజయవాడ నగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖ ఏజెన్సీ నుంచి తమిళనాడు కోయంబత్తూరు తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు రామవరప్పాడు దగ్గర పట్టుకున్నారు. మొక్కజొన్న పిండి బస్తాల చాటున తరలిస్తుండగా పట్టుకున్నారు. 800 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.