‘ధరల పెరుగుదలతో ప్రజలపై పెనుభారం’
ABN , First Publish Date - 2022-05-20T04:55:14+05:30 IST
పెరిగిన నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెరుగుదలతో ప్రజలపై పెనుభారమైందని టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరిరావు అన్నారు. భవానీనగర్ ప్రాంతంలో గురువారం ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వి హంచి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.
కొనసాగుతున్న ‘బాదుడే బాదుడు’ నిరసనలు
టెక్కలి: పెరిగిన నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెరుగుదలతో ప్రజలపై పెనుభారమైందని టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరిరావు అన్నారు. భవానీనగర్ ప్రాంతంలో గురువారం ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు హనుమంతు రామకృష్ణ, కోళ్ల లవకుమార్, మామిడి రాము, దల్లి ప్రసాదరెడ్డి, రెయ్యి ప్రీతీష్, కోరాడ రాం ప్రసాద్, జీరు వెంకటరెడ్డి, సోడిముడి కిరణ్ తదితరులున్నారు.
గులుమూరులో...
హిరమండలం/పాతపట్నం: హిరమండలం మండలం గులుమూరు, పాతపట్నం మండలం పెద్దలోగిడి గ్రామాల్లో గురువారం ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించారు. టీడీ పీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ పాల్గొని మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చార్జీల పెంపుతో ప్రజలపై పెనుభారం మోపిం దన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కార్య క్రమంలో నాయకులు యాళ్ల నాగేశ్వరరావు, కె.అప్పలరాజు, ఎస్.గోవింద రావు తదితరులు పాల్గొన్నారు.
దండుగోపాలపురంలో..
సంతబొమ్మాళి: దండుగోపాలపురంలో గురువారం బాదుడే బాదుడు నిర్వహించారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, మాజీ సర్పంచ్ ఆరంగి వసంతరావు, మండల ఐటీడీపీ కోఆర్డినేటర్ బెండి అరుణ్కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు జీరు భీమారావు, రెడ్డి అప్పన్న, పుక్కళ్ల శ్రీనివాసరావు, అప్పిని వెంకటేష్ పాల్గొన్నారు.