మరో 4 రోజులు వడగాల్పులు

ABN , First Publish Date - 2020-05-27T07:39:13+05:30 IST

రోహిణి కార్తెలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంకంటే 5 డిగ్రీలు అధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాయువ్య దిశ నుంచి వేడిగాలులు వస్తుండటంతో ఈనెల 21 తేదీ నుంచి ఎండ తీవ్రత గణనీయంగా...

మరో 4 రోజులు వడగాల్పులు

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): రోహిణి కార్తెలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంకంటే 5 డిగ్రీలు అధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాయువ్య దిశ నుంచి వేడిగాలులు వస్తుండటంతో ఈనెల 21 తేదీ నుంచి ఎండ తీవ్రత గణనీయంగా పెరిగింది. మరో 4 రోజులపాటు రాష్ట్రంలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రత ఉంటుందని 29వ తేదీ తర్వాత ఇవి స్వల్పంగా తగ్గుముఖం పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర అధికారి రాజారావు తెలిపారు. ఈ సీజన్‌లో జూన్‌ పదో తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, ఆతర్వాత నైరుతి రుతు పవనాల ప్రవేశంతో  తగ్గిపోతాయని చెప్పారు. వడగాడ్పులకు తోడుగా క్యుములోనింబస్‌ మేఘాలు కూడా రాబోయే 4 రోజుల్లో ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వీటి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.


Updated Date - 2020-05-27T07:39:13+05:30 IST