ప్లీనరీకి హాజరై గుండెపోటుతో మృతి

ABN , First Publish Date - 2022-07-10T01:34:45+05:30 IST

వైసీపీ ప్లీనరీకి భోగాపురం నుంచి వచ్చిన వైసీపీ సీనియర్‌ నేత సుందర గోవిందరావు గుండెపోటుతో మరణించారు.

ప్లీనరీకి హాజరై గుండెపోటుతో మృతి

విజయవాడ: వైసీపీ ప్లీనరీకి భోగాపురం నుంచి వచ్చిన వైసీపీ సీనియర్‌ నేత సుందర గోవిందరావు గుండెపోటుతో మరణించారు. విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు మంగళగిరిలో జరిగిన వైసీపీ ప్లీనరీలో పాల్గొనేందుకు గురువారం వచ్చారు. వీరిలో భోగాపురం గ్రామానికి చెందిన సుందర గోవిందరావు కూడా ఉన్నారు, ఆయన శుక్రువారం ఉత్సహంగా ప్లీనరీలో పాల్గొన్నారు. శనివారం మంత్రి బొత్స సత్యనారాయణ జన్మదినం కావడంతో నియోజకవర్గం నుంచి వచ్చిన వారు శుభాకాంక్షలు తెలిపేందుకు బెంజిసర్కిల్‌ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్‌కు వెళ్లారు. అక్కడ గోవిందరావు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో పక్కనే ఉన్న ఎమ్మెల్యే అప్పలనాయుడు ఇతర సహచరులు కారులో బందర్‌ రోడ్డులోని రమేష్‌ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అయన్ను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. 

Updated Date - 2022-07-10T01:34:45+05:30 IST