Supreme court: వరవరరావు బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా
ABN , First Publish Date - 2022-07-19T17:30:38+05:30 IST
విరసం నేత వరవరరావు బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది.
న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావు(Varavara rao) బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో విచారణకు కేంద్ర ప్రభుత్వం(Central government) తరపున అదనపు సొలిసిటర్ జనరల్ రాజు(Raju) హాజరయ్యారు. తదుపరి విచారణ పూర్తి స్థాయిలో చేపట్టనున్నట్లు జస్టిస్ యుయు లలిత్(Lalith), జస్టిస్ రవీంద్ర భట్(Bhat) ఉన్నతన్యాస్థానం నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 2లోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని, ఆగస్టు 8 లోపు దానికి రిజాయిండర్ దాఖలు చేయాలని వాద ప్రతివాదులకు కోర్టు తేల్చిచెప్పింది. తుది విచారణ ఆగస్టు 10న చేపట్టనున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అప్పటివరకు యదాతథ స్థితిని కొనసాగించాలని జస్టిస్ యుయు లలిత్ ధర్మాసనం ఆదేశించింది. బీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా వరవరరావును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.