మూడు రాజధానుల పిటిషన్లపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-01-28T23:11:10+05:30 IST

రాష్ట్రానికి మూడు రాజధానుల పిటిషన్లపై హైకోర్టులో

మూడు రాజధానుల పిటిషన్లపై హైకోర్టులో విచారణ

అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానుల పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. మూడు రాజధానుల బిల్లులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం చట్టాలను ఉపసంహరించుకున్నా మళ్లీ ప్రవేశ పెడతామని పేర్కొనడంతో విచారణ కొనసాగించాలని న్యాయవాదులు కోరారు. పిటీషన్లలో ఏ అంశాలపై  విచారణ కొనసాగించాలో అఫిడవిట్‌లు దాఖలు చేయాలని గతంలో త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. అఫిడవిట్‌లు దాఖలు చేసి వాదనలను  న్యాయవాదులు వినిపించారు.


సీఆర్డీఏ మాస్టర్‌ ప్లాన్‌ అభివృద్ధి, నిర్మాణం నిలిపివేసిన పనులు కొనసాగించడం, రైతుల ప్లాట్‌లను అభివృద్ధి చేయడం, రాజధాని నుంచి కార్యాలయాల తరలింపు నిలిపివేత అంశాలపై వాదనలను పిటిషనర్ల తరపు న్యాయవాదులు వినిపించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి హైకోర్టు వాయిదా వేసింది. పిటీషనర్ల తరపున శ్యామ్‌ దివాన్‌, రమేష్‌, జంద్యాల రవిశంకర్‌, వాసిరెడ్డి ప్రభునాథ్‌, అంబటి సుధాకర్‌ రావు, ఉన్నం మురళీదర్‌ , కె.ఎస్‌ మూర్తి, సత్యప్రసాద్‌ ,  ప్రసాద్‌ బాబు, కేఎస్‌ మూర్తి, ఇంద్రనీల్‌, తదితరులు వాదించారు.

Updated Date - 2022-01-28T23:11:10+05:30 IST