నడకతో ఆరోగ్యం!

ABN , First Publish Date - 2021-03-08T05:26:42+05:30 IST

ప్రతిరోజు క్రమం తప్పకుండా కొంతసేపు వాకింగ్‌ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని సీఐ దశరఽథరామారావు అన్నారు.

నడకతో ఆరోగ్యం!
జెండాఊపి 2కే రన్‌ ప్రారంభిస్తున్న సీఐ దశరథరామారావు

నడకతో ఆరోగ్యం!

గూడూరు, మార్చి 7:  ప్రతిరోజు క్రమం తప్పకుండా కొంతసేపు వాకింగ్‌ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని సీఐ దశరఽథరామారావు అన్నారు. స్థానిక ఏఏరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం 2కే రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం కోసం నడక, వ్యాయామం తప్పనిసరిగా చేయాలన్నారు.  వ్యాయామం చేసేవారు కరోనా బారిన పడలేదన్నారు. ప్రతిఒక్కరిలో అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. పట్టణంలో రెండు కిలోమీటర్ల మేర రన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో యమహా సుబ్రమణ్యం, పురుషోత్తం, చంద్రశేఖర్‌, వసంతకుమార్‌, మునిగిరీష్‌, వేగూరు రాజేంద్రప్రసాద్‌, ఉప్పాల వాసుగౌడ్‌, కట్టా మురళీకృష్ణ, రాజా, ఆరికట్ల మస్తాన్‌నాయుడు, వేముల శ్రీధర్‌, పంటా మోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, చదలవాడ సుధాకర్‌, తూపిలి నాగేశ్వరరావు, కేతబోయిన ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T05:26:42+05:30 IST