క్రీడలతో ఆరోగ్యం
ABN , First Publish Date - 2021-11-28T02:53:47+05:30 IST
క్రీడలతో ఆరోగ్య పరిరక్షణ సాధ్యమని జడ్పీటీసీ సభ్యురాలు ఊటుకూరు యామిని అన్నారు. శనివారం స్థానిక ఏఏరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏపీ సీఎం కప్ మండలస్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలను నిర్వహించారు.
గూడూరు, నవంబరు 27: క్రీడలతో ఆరోగ్య పరిరక్షణ సాధ్యమని జడ్పీటీసీ సభ్యురాలు ఊటుకూరు యామిని అన్నారు. శనివారం స్థానిక ఏఏరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏపీ సీఎం కప్ మండలస్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గురువయ్య, ఎంపీడీవో నాగమణి, ఎంఈవో సునీల్కుమార్, హెచ్ఎం రవూఫ్, పీడీలు కరీముల్లాఖాన్, విజయలక్ష్మీ, సురేష్బాబు, కల్పన, పార్వతి, మనోజ్కుమార్, శివకుమార్, భాస్కర్, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.