ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-04-22T05:15:07+05:30 IST

ప్రకృతి వ్యవసాయంతోనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని మండల రిసోర్స్‌ పర్సన రామ్మోహన తెలిపారు.

ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం
గొల్లలగూడూరులో ఏర్పాటు చేస్తున్నమినీ ప్రీమాన్సూన డ్రైసోయింగ్‌ పద్దతి

వేముల, ఏప్రిల్‌ 21: ప్రకృతి వ్యవసాయంతోనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని మండల రిసోర్స్‌ పర్సన రామ్మోహన తెలిపారు. బుధవా రం గొల్లలగూడూరు కేఎఫ్‌డబ్ల్యూ గ్రామంలో రామాంజనేయరెడ్డి పొలంలో మినీ ప్రీమాన్సూన డ్రైసోయింగ్‌ పద్దతిలో మోడల్‌ పంట ను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

మినీ ప్రీమమా న్సూన డ్రై పద్దతిలో భాగంగా ఆకుకూరలు, కూరగాయలు, గడ్డజాతి, తీగజాతి కూరగాయల విత్తనాలు మొతలైన 18 రకాల విత్తనాలు వేశామన్నారు. ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలను 365 రోజులు పండించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కేఎఫ్‌డబ్ల్యూ ఆర్‌పీ బాబు, బీసీఓ శంకరయ్య, మండల యాంకర్‌ రామాంజి, ఉమాదేవి, మండల రిసోర్స్‌ పర్సన రామ్మోహన, వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-22T05:15:07+05:30 IST