స్వచ్ఛ సంకల్పం’తో ఆరోగ్యకర వాతావరణం
ABN , First Publish Date - 2021-10-21T06:17:10+05:30 IST
గిరిజనులు స్వచ్ఛమైన వాతావరణంలో ఆరోగ్యంగా జీవించేలా ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలక్రిష్ణ అన్నారు.
ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ
జి.మాడుగుల, అక్టోబరు 20: గిరిజనులు స్వచ్ఛమైన వాతావరణంలో ఆరోగ్యంగా జీవించేలా ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలక్రిష్ణ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వీధులు, ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలని పిలుపునిచ్చారు. కాగా జి.మాడుగుల-2 సచివాలయం వీఆర్వో టి.వెంకటేశ్వర్ బుధవారం విధులు హాజరు కాకపోవడంతో అతనికి ఒక రోజు జీతం కట్ చేయాలని తహసీల్దార్ చిరంజీవిపడాల్ను ఆయన ఆదేశించారు. అనంతరం పాలమామిడి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె.వెంకన్నబాబు, అధికారులు పాల్గొన్నారు.