ఇళ్లకు వెళ్లి వైద్యం అందించాలి
ABN , First Publish Date - 2022-08-05T05:06:25+05:30 IST
పీహెచ్సీలకు రాలేని రోగులను గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి వైద్యం అందించాలని పీహెచ్సీ వైద్యులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కృష్ణబాబు ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కృష్ణబాబు
తాడికొండ, ఆగస్టు 4: పీహెచ్సీలకు రాలేని రోగులను గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి వైద్యం అందించాలని పీహెచ్సీ వైద్యులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కృష్ణబాబు ఆదేశించారు. గురువారం తాడికొండ మండలం పొన్నెకల్లు పీహెచ్సీని సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ విలేజ్ ఫ్యామిలీ కాన్సెప్ట్లో భాగంగా 104 వాహనాలతో పాటు వెళ్లి డాక్టర్, ఎఎల్పీహెచ్, ఏఎన్ఎం, ఆశాలు ఉదయం ఓపీలను తూచ తప్పకుండా చూడాలన్నారు. అనంతరం తాడికొండ శివారు బడేపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్ను సందర్శించారు. త్వరితగతిని నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్, ఆరోగ్య శాఖ కోఆర్డినేటర్ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సుమయాఖాన్, పీహెచ్సీ డాక్టర్ తిరుమలాదేవి పాల్గొన్నారు.