Covid సేవల కోసం రాష్ట్రానికి రూ.850 కోట్లు

ABN , First Publish Date - 2022-02-02T17:28:30+05:30 IST

కొవిడ్‌ అత్యవసర సేవల కోసం రాష్ట్రానికి కేంద్రం రూ.850 కోట్లు కేటాయించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ నగరంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. జాతీయ ఆరోగ్య

Covid సేవల కోసం రాష్ట్రానికి రూ.850 కోట్లు

                  - ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ వెల్లడి 


బెంగళూరు: కొవిడ్‌ అత్యవసర సేవల కోసం రాష్ట్రానికి కేంద్రం రూ.850 కోట్లు కేటాయించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ నగరంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్‌లో కనీసం 20 శాతం నిధులను పెంచాలని కేంద్రానికి తాము విజ్ఞప్తి చేశామన్నారు. వైద్య ఆరోగ్యసేవల రంగంలో మౌలిక సదుపాయాలు పెంచేందుకు కేంద్రం చేసిన ప్రతిపాదనలను ఆయన హర్షించారు. కాగా ఐటీబీటీశాఖల మంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ స్పందిస్తూ బడ్జెట్‌లో డిజిటల్‌ విద్య, నైపుణ్యశిక్షణ, స్టార్ట్‌పలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్వాగతించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఇప్పటికే ఈ మూడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు.

Updated Date - 2022-02-02T17:28:30+05:30 IST