ఉద్యోగులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ABN , First Publish Date - 2021-06-18T05:56:22+05:30 IST
విద్యుత్ ఉద్యోగులు విధి నిర్వహణలో నిబద్దతగా పనిచేయటంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని గుంటూరు సర్కిల్ ఆపరేషన్స్ ఎస్ఈ మురళీమోహన్ తెలిపారు.
గుంటూరు, జూన్ 17: విద్యుత్ ఉద్యోగులు విధి నిర్వహణలో నిబద్దతగా పనిచేయటంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని గుంటూరు సర్కిల్ ఆపరేషన్స్ ఎస్ఈ మురళీమోహన్ తెలిపారు. నల్లచెరువులోని విద్యుత్ కార్యాలయంలో ఉద్యోగుల కోసం వైద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురువారం వైద్యాలయాన్ని సందర్శించిన ఆయన ఉద్యోగులకు ప్రత్యేక సూచనలు చేశారు. కొవిడ్ నేపథ్యంలో ఉద్యోగులు విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో గుంటూరు-1 ఈఈ శ్రీనివాసబాబు, డిప్యూటీ ఈఈ రాజేష్ఖన్నా, డాక్టర్ రాజశేఖర్, రాజమోహన్రావు, ఖాన్ తదితరులు పాల్గొన్నారు.