ఉద్యోగులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

ABN , First Publish Date - 2021-06-18T05:56:22+05:30 IST

విద్యుత్‌ ఉద్యోగులు విధి నిర్వహణలో నిబద్దతగా పనిచేయటంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని గుంటూరు సర్కిల్‌ ఆపరేషన్స్‌ ఎస్‌ఈ మురళీమోహన్‌ తెలిపారు.

ఉద్యోగులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
వైద్యుల పరీక్షలను పరిశీలిస్తున్న ఎస్‌ఈ మురళీమోహన్‌ తదితరులు

గుంటూరు, జూన్‌ 17: విద్యుత్‌ ఉద్యోగులు విధి నిర్వహణలో నిబద్దతగా పనిచేయటంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని గుంటూరు సర్కిల్‌ ఆపరేషన్స్‌ ఎస్‌ఈ మురళీమోహన్‌ తెలిపారు. నల్లచెరువులోని విద్యుత్‌ కార్యాలయంలో ఉద్యోగుల కోసం వైద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురువారం వైద్యాలయాన్ని సందర్శించిన ఆయన ఉద్యోగులకు ప్రత్యేక సూచనలు చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో ఉద్యోగులు విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో గుంటూరు-1 ఈఈ శ్రీనివాసబాబు, డిప్యూటీ ఈఈ రాజేష్‌ఖన్నా, డాక్టర్‌ రాజశేఖర్‌, రాజమోహన్‌రావు, ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-18T05:56:22+05:30 IST