పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో వైద్యశిబిరం

ABN , First Publish Date - 2020-12-06T04:28:12+05:30 IST

ఆళ్లపల్లి మారుమూల గ్రామాల్లో పోలీసులు వైద్యశిబిరం నిర్వ హించారు.

పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో వైద్యశిబిరం
రోగులను పరీక్షిస్తున్న సంధ్యారాణి, చిత్రంలో ఎస్‌ఐ సంతోష్‌

ఆళ్లపల్లి, డిసెంబరు 5: ఆళ్లపల్లి మారుమూల గ్రామాల్లో పోలీసులు వైద్యశిబిరం నిర్వ హించారు. శనివారం మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీలోని వలస ఆదివాసీ గుంపులో ఆళ్లపల్లి పోలీ్‌సస్టేషన్‌ ఎస్‌ఐ సంతో్‌షకుమార్‌ ఆధ్వర్యంలో వైద్యురాలు సంధ్యారాణి సమక్షంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. రోగులను పరీక్షించి ఉచి తంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. ధీర్ఘకాలిక వ్యా ధులతో బాధపడేవారు పెద్దాసుప్పత్రికి వెళ్లి చూపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వెంకటాపురం సర్పంచ్‌ నర్సింహరావు, పోలీస్‌ సిబ్బంది నాగరాజు, రజ్వీ, కోటి, రమేష్‌, శ్రీను, సంతు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T04:28:12+05:30 IST