వైద్యం వికటించి శిశువు మృతి

ABN , First Publish Date - 2021-05-13T07:31:57+05:30 IST

భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బుధవారం వైద్యం వికటించి శిశువు మృతిచెందినట్లు శిశువు తల్లిదండ్రులు ఆరోపించారు.

వైద్యం వికటించి శిశువు మృతి

డాక్టర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
 భువనగిరి టౌన, మే 12: 
భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బుధవారం వైద్యం వికటించి శిశువు మృతిచెందినట్లు శిశువు తల్లిదండ్రులు ఆరోపించారు. శిశువు తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూరు మండలం వర్టూరు గ్రామా నికి చెందిన కొత్త నవ్య తొలి కాన్పుకోసం మూడు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రిలో చేరింది. అయితే మంగళవారం ప్రసూతి నొప్పులు ప్రారంభం కాగా సాధారణ కాన్పు అవుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ బుధవారం ఉదయానికి గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమిం చడంతో హడావుడిగా శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్సతో పురుడుపోసుకున్న మగ శిశువు కొన్ని నిమిషాల వ్యవధిలోనే మృతి చెందాడు. దీంతో సకాలంలో శస్త్ర చికిత్స చేయడంలో డాక్టర్లు చూపిన నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. వైద్య చికిత్సలో నిర్లక్ష్యం చూపిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని శిశువు తండ్రి కొత్త విఠల్‌ కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసుల జోక్యంతో వివాదం తాత్కాలికంగా సద్దుమని గింది. మృతశిశువును కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు.

Updated Date - 2021-05-13T07:31:57+05:30 IST