రాజకీయ వేదికపై హెడ్ కానిస్టేబుల్ ఉరుసు ఉత్సవంలో సన్మానం
ABN , First Publish Date - 2022-01-24T06:23:12+05:30 IST
ఉరుసు ఉత్సవంలో ఏర్పాటు చేసిన సన్మాన వేదికపై రాజకీయ నాయకులతో పాటు హెడ్ కానిస్టేబుల్ రఘునాథరెడ్డి కూడా ఆశీనులు కావడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది.
రాయదుర్గం, జనవరి 23: ఉరుసు ఉత్సవంలో ఏర్పాటు చేసిన సన్మాన వేదికపై రాజకీయ నాయకులతో పాటు హెడ్ కానిస్టేబుల్ రఘునాథరెడ్డి కూడా ఆశీనులు కావడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. కణేకల్లు మండలంలోని మాల్యం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఉరుసు ఉత్సవంలో ఏపీఐఐసీ చైర్మన మెట్టు గోవిందరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన గౌని ఉపేంద్రరెడ్డితో పాటు చాలా మంది వైసీపీకి చెందిన నాయకులు వేదికపై ఆశీనులయ్యారు. ఒక్కొక్కరు ప్రసంగాలు చేస్తూ వచ్చారు. కాగా వారితో సమానంగా మఫ్టీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రఘునాథరెడ్డి కూడా ఆశీనులై సన్మానాన్ని స్వీకరించారు. రాజకీయంగా వైసీపీ శ్రేణులతో చాలా సన్నిహితంగా ఉండే ఆయన ఒక్కసారిగా వేదిక పంచుకోవడంపై ఆ పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. దీనిపై పోలీసు అధికారులు కూడా అవాక్కయ్యారు. ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ నాయకులతో వేదికను పంచుకోవడం నిబంధనలకు విరుద్ధం. పైగా రాయదుర్గం పట్టణంలో ఉన్న రిక్రియేషన క్లబ్కు సహాయ కార్యదర్శిగా కూడా ఇటీవల రఘునాథరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోలీసు శాఖలో అధికారుల పట్ల లెక్కలేనితనంతో ఉంటారనే ఆరోపణలు అతనిపై ఉన్నట్లు ఆ శాఖలో చర్చ తీవ్రంగా సాగుతోంది. హెడ్ కానిస్టేబుల్ రఘునాథరెడ్డి గతంలో రెండు సార్లు సస్పెం డ్ అయిన విషయం తెలిసిందే. వైసీపీలో కీలక నాయకులు అండగా ఉండటంతో ఇష్టానుసారంగా వ్యవహరి స్తున్న ట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి.