దేశం పేరే మోదీ అవుతుంది: మమతా బెనర్జీ ఫైర్

ABN , First Publish Date - 2021-03-09T00:19:55+05:30 IST

రాబోయే రోజుల్లో ఈ దేశం పేరును మోదీగా మార్చేసినా ఆశ్చర్యం లేదని మమతా అన్నారు. సోమవారం రాష్ట్రంలో నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశం పేరే మోదీ అవుతుంది: మమతా బెనర్జీ ఫైర్

కోల్‌కతా: కోవిడ్ వ్యాక్సీన్ ధ్రువపత్రాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రం ఉండడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే కాలేజీలకు, మైదానాలకు ఆయన పేరుతో ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఈ దేశం పేరును మోదీగా మార్చేసినా ఆశ్చర్యం లేదని మమతా అన్నారు. సోమవారం రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘మోదీ తన పేరును అంతటా వ్యాప్తి చేస్తున్నారు. అన్నింటికీ తన పేరు పెట్టుకుంటున్నారు. కోవిడ్ వ్యాక్సీన్‌లపై ఆయన ఫొటోలు ముద్రించారు. ఇప్పుడది కోవిడ్ వ్యాక్సీన్ కాదు, మోదీ వ్యాక్సీన్. అంతే కాదు, చాలా కాలేజీలు ఇప్పటికే మోదీ పేరుతో నడుస్తున్నాయి. తాజాగా స్టేడియం కూడా తన పేరు పెట్టుకున్నారు. చూస్తూ ఉండండి.. ఈ దేశం పేరును కూడా మార్చేసి తన పేరు పెట్టుకుంటారు’’ అని మమతా బెనర్జీ అన్నారు.

Updated Date - 2021-03-09T00:19:55+05:30 IST