టెస్టుల్లో ధోనీ గొప్ప కెప్టెన్ అవడానికి అతనే కారణం: గంభీర్

ABN , First Publish Date - 2020-07-12T04:13:48+05:30 IST

భారత క్రికెట్ జట్టు మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనీపై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

టెస్టుల్లో ధోనీ గొప్ప కెప్టెన్ అవడానికి అతనే కారణం: గంభీర్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనీపై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ధోనీ మారడం అతని అదృష్టమని గంభీర్ చెప్పాడు. ధోనీ సారధిగా ఉన్నప్పుడు భారత జట్టు అత్యుత్తమంగా ఉందని, అందువల్లే అతను చాలా ట్రోఫీలు గెలిచాడని ఆరోపించాడు. ముఖ్యంగా టెస్టుల్లో ధోనీ గొప్ప కెప్టెన్‌గా మారడానికి మాజీ పేసర్ జహీర్‌ఖాన్ కారణమని గంభీర్ వెల్లడించాడు. ‘భారత బౌలర్లలో జహీర్ అత్యుత్తమ అంతర్జాతీయ బౌలర్. అతను లేకపోతే టెస్టుల్లో ధోనీ గొప్ప కెప్టెన్ అయ్యేవాడు కాదు’ అని విమర్శించాడు.

Updated Date - 2020-07-12T04:13:48+05:30 IST