నీటికుంటలో పడి బాలుడి మృతి
ABN , First Publish Date - 2021-01-25T06:38:40+05:30 IST
ప్రమాదశవాత్తూ నీటికుంటలో పడి ఓ బాలుడు మృతి చెందాడు.
చంద్రగిరి, జనవరి 24: ప్రమాదశవాత్తూ నీటికుంటలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి మండలంలోని దోర్నకంబాల పంచాయతీ బోణాకాల్వకు చెందిన చంద్ర, వళ్లెమ్మ దంపతులకు కళ్యాణ్కుమార్ (6), చిన్న అనే పిల్లలున్నారు. వళ్లెమ్మ సంఘ మిత్రగా పనిచేస్తున్నారు. ఆదివారం కళ్యాణ్కుమార్ తన తాతతో కలిసి మేకలను తోలుకుని సమీపంలోని అడవిలోకి వెళ్లాడు. అక్కడి ఓటుకుంట వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన తాత వచ్చి ఆ బాలుడిని కుంట నుంచి బయటకు తీసేలోపే మృతి చెందాడు. కొడుకు మృతితో ఆ తల్లిదండ్రుల రోదన ఆపడం ఎవరి తరమూ కావడం లేదు.