హెడ్డీఎఫ్సీ బ్యాంక్ చోరీ కేసు ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు
ABN , First Publish Date - 2021-08-17T16:21:24+05:30 IST
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చోరీ కేసును ఛేదించేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
గుంటూరు: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చోరీ కేసును ఛేదించేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కడే చోరీకి పాల్పడినట్లు లాలాపేట పోలీసులు గుర్తించారు. దొంగను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. రూ. 23 లక్షలు అపహరించాడు. బ్యాంకు ఆనవాళ్ళు బాగా తెలిసిన వ్యక్తే చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దొంగ రాత్రి సమయంలో బ్యాంక్లోకి చొరబడి గ్యాస్ కట్టర్తో లాకర్ ఓపెన్ చేశాడు. నగర నడిబొడ్డున ఉన్న బ్యాంక్లో చోరీ జరగటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు నగరంలోని హిందూ కళాశాల పక్కనే ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు గాంధీపార్కు బ్రాంచిలో ఆదివారం వేకువజామున 4 గంటల నుంచి 6.30 గంటల మధ్య ఈ చోరీ జరిగింది.