వెంటాడిన ఆర్బీఐ పాలసీ భయాలు
ABN , First Publish Date - 2022-09-28T06:26:40+05:30 IST
ఈక్విటీ మార్కెట్ నుంచి భారీగా తరలిపోతున్న విదేశీ పెట్టుబడులపై ఆందోళనలతో పాటుగా శుక్రవారం వెలువడనున్న ఆర్బీఐ పాలసీకి ముందు నెలకొన్న అప్రమత్తత మంగళవారం స్టాక్ మార్క్లెను నష్టాల బాటలో నడిపించింది.
సెన్సెక్స్ 38 పాయింట్లు డౌన్
ముంబై: ఈక్విటీ మార్కెట్ నుంచి భారీగా తరలిపోతున్న విదేశీ పెట్టుబడులపై ఆందోళనలతో పాటుగా శుక్రవారం వెలువడనున్న ఆర్బీఐ పాలసీకి ముందు నెలకొన్న అప్రమత్తత మంగళవారం స్టాక్ మార్క్లెను నష్టాల బాటలో నడిపించింది. నాలుగు రోజుల భారీ పతనం కారణంగా ఈక్విటీ సూచీలు పాజిటివ్గానే ప్రారంభమైనా మెటల్, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకారం నష్టాలకు కారణమైంది. అయితే ఎంపిక చేసిన ఫార్మా, ఐటీ షేర్ల కొనుగోళ్లు సూచీలను ఆదుకున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో 560 పాయింట్ల మేరకు లాభపడినప్పటికీ చివరికి 37.70 పాయింట్ల నష్టంతో 57107.52 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 16,950 కన్నా దిగజారినా కోలుకుని చివరికి 8.90 పాయింట్ల నష్టంతో 17,007.40 వద్ద క్లోజైంది. ఎఫ్పీఐలు సోమవారం రూ.5101.30 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు.
14 పైసలు లాభపడిన రూపాయి: పరిమిత పరిధిలోనే కన్సాలిడేట్ అయిన రూపాయి చివరికి 14 పైసల లాభంతో 81.53 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఆరంభంలో 81.45 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 81.30-81.64 మధ్యన కదలాడింది. సమీప భవిష్యత్తులో రూపాయి 81.20-81.80 మధ్యన కదలాడవచ్చని ఫారెక్స్ నిపుణుల అంచనా.