హథీరాంజీ మఠంలో నగల మాయం!

ABN , First Publish Date - 2020-07-11T19:06:32+05:30 IST

తిరుపతిలోని హథీరాంజీ మఠంలో బంగారు, వెండి నగలు మాయమైనట్టు..

హథీరాంజీ మఠంలో నగల మాయం!

ఫిర్యాదు ఇవ్వని మహంతు


తిరుపతి(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని హథీరాంజీ మఠంలో బంగారు, వెండి నగలు మాయమైనట్టు తెలుసుకుని.. రెండ్రోజులవుతున్నా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మఠం పరువు పోకుండా మహంతు అర్జున్‌దాస్‌ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం మహంతు పలువురు సిబ్బందిని పిలిపించి.. రూ.6లక్షలతో కొత్త నగలు తీసుకురావాలని సూచించినట్టు సమాచారం. దాంతో తమకు సంబంధం లేకపోయినా తాము డబ్బులు ఎందుకు కట్టాలని కొందరు అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కోట్లాది రూపాయల ఆస్తులున్న మఠంలో నగలు మాయం కావడంపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2020-07-11T19:06:32+05:30 IST