హసన్ పట్టణంలో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-05T20:56:15+05:30 IST

హసన్ పట్టణంలో పెరిగిన కరోనా కేసులు

హసన్ పట్టణంలో పెరిగిన కరోనా కేసులు

బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఆదివారం కొత్తగా 13 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 492 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న 255 మంది బాధితులను డిశ్చార్జ్ చేశారు. 229 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా వల్ల 8 మంది మృతి చెందినట్లు వైద్య శాఖ తెలిపింది. 


Updated Date - 2020-07-05T20:56:15+05:30 IST