చనిపోయిన భర్తనే తలుచుకుంటూ.. పిల్లలతో కలిసి ఊరిబయట నివసిస్తున్న మహిళ జీవితంలో ఎదురైన ఊహించని ఘటన.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-14T17:50:00+05:30 IST

ఎనిమిదినెలల క్రితం..

చనిపోయిన భర్తనే తలుచుకుంటూ.. పిల్లలతో కలిసి ఊరిబయట నివసిస్తున్న మహిళ జీవితంలో ఎదురైన ఊహించని ఘటన.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇంటర్‌నెట్‌డెస్క్: ఎనిమిదినెలల క్రితం భర్త చనిపోయాడు. అతడిని మరిచపోలేక ప్రతిరోజూ భార్య ఏడుస్తునే ఉంది. పిల్లల ఆకలి తీర్చడం కోసం ఆమె పనికి వెళ్తోంది. అలాంటి ఆమె జీవితంలో బుధవారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..


హర్యానా రాష్ట్రం కైతల్ జిల్లా మోహన గ్రామానికి చెందిన ఓ 36ఏళ్ల మహిళ భర్త ఎనిమిది నెలల క్రితం చనిపోయాడు. వారికి ఏడేళ్ల కూతురు, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. భర్త చనిపోవడంతో వాళ్ల జీవితం అల్లకల్లోలమైంది. పిల్లల ఆకలి తీర్చడం కోసం ఆమె పనికి వెళ్తోంది. అయితే బుధవారం రాత్రి ఆమె జీవితంలో ఊహించని సంఘటన ఎదురైంది.



రాత్రి నిద్రపోతున్న సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చారు. వారి చేతిలో పదునైన కత్తులు ఉన్నాయి. గాఢ నిద్రలో ఉన్న ఆ ముగ్గురిపై దారుణానికి పాల్పడ్డారు. పక్కింట్లో నుంచి ఏవో అరుపులు వినపడుతున్నాయని చుట్టుపక్కలవాళ్లు ఆమె ఇంటికి వెళ్లారు. కానీ అప్పటికే దారుణం జరిగిపోయింది. ఇంట్లో ఉన్నవారందరూ రక్తపుమడుగుల్లో ఉండడం చూసి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో తల్లీకూతురు చనిపోయారు. పిల్లాడు కొన ఊపిరితో ఉండడం గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లారు.


సమాచారం పోలీసులకు అందించగా, సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. వారికి గ్రామంలో ఏమైనా తగాదాలు ఉన్నాయా అని చుట్టుపక్కలవాళ్లను ప్రశ్నించగా.. ఎలాంటి గొడవలకు వెళ్లేవారు కాదని, అందరితో కలివిడిగా ఉండేవారని సమాధానం చెప్పారు. పిల్లలు అని చూడకుండా కిరాతకంగా నరికిన ఆ దుండగులను త్వరలోనే పట్టుకుంటామని, హత్యకు గల కారణాలేంటో కనుక్కుంటామని పోలీసులు తెలిపారు. 





Updated Date - 2021-10-14T17:50:00+05:30 IST