హనుమంతుడు శక్తిశాలి: Bandaru dattatreya
ABN , First Publish Date - 2022-04-16T16:00:48+05:30 IST
దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హనుమంతుడు శక్తిశాలి అని, యువత హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ప్రతి యువకుడు హనుమాన్ చాలీసా పఠించాలని చెప్పారు. హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్న భజరంగ్ దళ్, వీహెచ్పీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. రామరాజ్య స్థాపనకు ఈ యాత్రలు దోహదం చేస్తాయని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.