హర్యానాలో కాంగ్రెస్ ఆధిక్యం

ABN , First Publish Date - 2020-11-10T17:37:56+05:30 IST

హర్యానాలోని బరోడా ఉపఎన్నికలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి యోగేశ్వర్ దత్ కంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇందూ రాజ్ నర్వల్ ముందంజలో ఉన్నారు.

హర్యానాలో కాంగ్రెస్ ఆధిక్యం

బరోడా: హర్యానాలోని బరోడా ఉపఎన్నికలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి యోగేశ్వర్ దత్ కంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇందూ రాజ్ నర్వల్ ముందంజలో ఉన్నారు. 2వేల ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. ఇక్కడ ఐఎన్ఎల్‌డీ తరఫున జోగీందర్ సింగ్ మాలిక్ పోటీ చేశారు. పోలింగ్ కేంద్రం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.   


నవంబర్ 3న జరిగిన పోలింగ్‌లో 68శాతం పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకృష్ణ హుడా మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.   

Updated Date - 2020-11-10T17:37:56+05:30 IST