కరోనా కేసుల కట్టడికి హర్యానాలో కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-04-13T10:37:50+05:30 IST

కరోనా కేసుల కట్టడికి హర్యానాలో కర్ఫ్యూ

కరోనా కేసుల కట్టడికి హర్యానాలో కర్ఫ్యూ

చండీగడ్: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరగడంతో హర్యానా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. సోమవారం రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ ప్రకటించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించబడుతుందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటుందని అని హర్యానా హోమ్ మరియు ఆరోగ్య మంత్రి అనిల్ పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్రంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. కొన్ని రోజుల తరువాత పరిస్థితి అంచనా వేయబడుతుందని, తరువాత రాత్రి కర్ఫ్యూను కొనసాగించడంపై నిర్ణయం తీసుకోబడుతుందని మంత్రి చెప్పారు. హర్యానాలో ఆదివారం 3,440 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-04-13T10:37:50+05:30 IST