ఇతర రాష్ట్రాలూ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి : హర్ సిమ్రత్ కౌర్

ABN , First Publish Date - 2020-09-18T20:36:18+05:30 IST

కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యవసాయ రంగ బిల్లును వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన తర్వాత మొదటి సారిగా

ఇతర రాష్ట్రాలూ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి : హర్ సిమ్రత్ కౌర్

న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యవసాయ రంగ బిల్లును వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన తర్వాత మొదటి సారిగా హర్ సిమ్రత్ కౌర్ స్పందించారు. లబ్ధిదారులందర్నీ సంప్రదించిన తర్వాతే ఈ బిల్లును తేవాలని తాము డిమాండ్ చేశామని, అందులో రాజకీయం ఏముందని సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయ రంగ బిల్లును కేవలం పంజాబ్ రైతులే వ్యతిరేకించడం లేదని, హర్యానా, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లుపై సౌత్ ఇండియా మొత్తం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని కౌర్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-18T20:36:18+05:30 IST