దేవినేని ఉమాను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారా?..: హర్షకుమార్

ABN , First Publish Date - 2021-08-02T17:03:27+05:30 IST

సెలవులో ఉన్న సూపరిండెంట్ రాజారావును బదిలీ చేయటం సిగ్గుచేటని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.

దేవినేని ఉమాను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారా?..: హర్షకుమార్

రాజమండ్రి: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకువచ్చినప్పుడు జైలర్ డ్యూటీలో ఉన్నారని, సెలవులో ఉన్న సూపరింటెండెంట్ రాజారావును బదిలీ చేయటం సిగ్గుచేటని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దళితుల పట్ల ముఖ్యమంత్రి జగన్ వివక్ష చూపుతున్నారని విర్శించారు. నిజాయితీగా పనిచేసిన రాజమంఢ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను ఎందుకు బదిలీ చేశారని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో దేవినేనిని హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారా? ఆనే అనుమానం కలుగుతోందన్నారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు బదిలీ, దేవినేని హత్యకు కుట్రపై హైకోర్టు సుమోటాగా విచారణ చేపట్టాలని హర్షకుమార్ కోరారు. వైసీపీ ప్రభుత్వంలో 70 మంది సలహాదారులను పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, సీఎం బినామీ పేర్లతో విశాఖలో భూములు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక, మైనింగ్ మాఫియాలో కలెక్టర్లు బాగస్వామ్యం అవుతున్నారని హర్షకుమార్ విమర్శించారు.

Updated Date - 2021-08-02T17:03:27+05:30 IST