దేశంలో 2,084 కోవిడ్ ఆసుపత్రులు: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-04-21T00:12:56+05:30 IST

గడిచిన మూడు నుంచి నాలుగు రోజుల్లో 800లకు పైగా నాన్ ఐసీయూ బెడ్లను ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశాం. దీనిని మరింత పెంచుతాం. ఢిల్లీలో డీఆర్‌డీఓ, సీఎస్ఐఆర్ బెడ్లను సమకూర్చాయి. ఎయిమ్స్, సఫ్దార్‌గంజ్ ప్రాంతాల్లో మరిన్ని బెడ్లను

దేశంలో 2,084 కోవిడ్ ఆసుపత్రులు: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: దేశంలో మొత్తం 2,084 కోవిడ్ స్పెసిఫిక్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్-19 నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, దేశంలో కోవిడ్-19 పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 12 వేల క్వారంటైన్ సెంటర్లు ఉన్నాయని పేర్కొన్నారు.


‘‘మన దేశంలో కోవిడ్-19 తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ఫర్టిలిటీ రేటు 1.18 శాతం, కోవిడ్-19 ఐసీయూ రేటు కూడా 1.75 శాతం ఉన్నాయి. వైద్యం తీసుకుంటున్న బాధితుల్లో 0.40 శాతం వెంటిలేటర్ సపోర్ట్, 4.03 శాతం ఆక్సీజన్ సపోర్ట్‌ ఉన్నవారు ఉన్నారు’’ అని ఆయన తెలిపారు. కోవిడ్ నేపధ్యంలో దేశంలో వైద్యరంగ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసిందని ఆయన పేర్కొన్నారు. గతేడాది సుమారు 80 శాతం మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని హర్ష వర్ధన్ పేర్కొన్నారు.


‘‘గడిచిన మూడు నుంచి నాలుగు రోజుల్లో 800లకు పైగా నాన్ ఐసీయూ బెడ్లను ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశాం. దీనిని మరింత పెంచుతాం. ఢిల్లీలో డీఆర్‌డీఓ, సీఎస్ఐఆర్ బెడ్లను సమకూర్చాయి. ఎయిమ్స్, సఫ్దార్‌గంజ్ ప్రాంతాల్లో మరిన్ని బెడ్లను ఏర్పాటు చేయడానికి మేం ప్రయత్నిస్తున్నాం’’ అని హర్ష వర్ధన్ అన్నారు. ఇక రెమిడివిసర్ ధరలను ప్రభుత్వం పరిమితం చేసింది. రెమిడివసర్ సూది మందుల లభ్యత, స్థోమతలను పెంపొందించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు.

Updated Date - 2021-04-21T00:12:56+05:30 IST