వేధింపుల కేసు నమోదు

ABN , First Publish Date - 2020-11-28T05:15:07+05:30 IST

పెళ్లి జరిగి మూడు నెలలు తిరగకముందే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ మహిళ సంజామల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది.

వేధింపుల కేసు నమోదు


సంజామల, నవంబరు 27: పెళ్లి జరిగి మూడు నెలలు తిరగకముందే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ మహిళ సంజామల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. దొర్నిపాడు మండలంలోని క్రిష్టిపాడు గ్రామానికి చెందిన మందలూరి పర్వీన్‌ను మండలంలోని ముదిగేడు గ్రామానికి చెందిన నవీరసూల్‌కు ఇచ్చి గత ఆగస్టు నెలలో పెద్దలు వివాహం జరిపించారు. పర్వీన్‌ తండ్రి హుస్సేన్‌షా కట్నకానుకల కింద నవీరసూల్‌కు 35 తులాల బంగారం, రూ.5లక్షల నగదు ఇచ్చాడు. ఆ తర్వాత మూడు నెలల నుంచే అదనపు కట్నం కోసం అత్తమామలు, భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2020-11-28T05:15:07+05:30 IST