Commonwealth Games: తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్

ABN , First Publish Date - 2022-07-30T00:33:28+05:30 IST

కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో భాగంగా భారత మహిళలతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా

Commonwealth Games: తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో భాగంగా భారత మహిళలతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (australia) మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. భారత్ నిర్దేశించిన 155 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మరో ఓవర్ మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి అందుకుంది. భారత బౌలర్ రేణుక సింగ్ (Renuka Singh) అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియా టాపార్డర్‌ను కూల్చినప్పటికీ చివరి వరుస బ్యాటర్లు ఆష్లీ గార్డెనర్, గ్రేస్ హారిస్ క్రీజులో కుదురుకుని బౌలర్లపై ఎదురుదాడికి దిగి జట్టుకు విజయాన్ని అందించారు. గార్డెనర్ 35 బంతుల్లో 9 ఫోర్లతో అజేయంగా 52 పరుగులు చేయగా, గ్రేస్ హారిస్ 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసింది. అలా కింగ్ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. 


అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్(Harmanpreet Kaur) జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ 52 సెంచరీ సాధించగా, షెఫాలీ వర్మ 48 పరుగులు చేసి రెండు పరుగుల తేడాతో అర్ధ సెంచరీ మిస్సైంది. ఆసీస్ బౌలర్లలో జొనాసెన్ 4 వికెట్లు పడగొట్టింది. భారత జట్టు తన రెండో మ్యాచ్‌ను ఈ నెల 31న పాకిస్థాన్‌తో ఆడనుంది.

Updated Date - 2022-07-30T00:33:28+05:30 IST