హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-08-18T04:35:40+05:30 IST
స్వతంత్య్ర భారత వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతకుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
- రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడి
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 17 : స్వతంత్య్ర భారత వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతకుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం నిర్వహించనున్నామని చెప్పారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని అధికారులు పూర్తి చే యాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డీఆర్డీవో శేషాద్రి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.