హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై హరీశ్ స్పందన
ABN , First Publish Date - 2021-11-03T00:22:11+05:30 IST
హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితంపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పందించారు.
హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా హుజురాబాద్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయని ఆరోపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారని, జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని హరీశ్ చెప్పారు. ఒక్క ఎన్నికలో ఓటమితో కుంగిపోమన్నారు. గెలిచిననాడు పొంగిపోలేదని, ఓడినా, గెలిచినా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుందని హరీశ్ చెప్పారు.