అబద్దాలే పునాదిగా బీజేపీ ప్రచారం చేస్తోంది: హరీష్రావు
ABN , First Publish Date - 2020-10-31T02:00:21+05:30 IST
అబద్దాలే పునాదిగా బీజేపీ ప్రచారం చేస్తోందని మంత్రి హరీష్రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ ఎక్కడని అంటున్నారని, అసలు తెలంగాణ అంటే టీఆర్ఎస్..
సిద్దిపేట: అబద్దాలే పునాదిగా బీజేపీ ప్రచారం చేస్తోందని మంత్రి హరీష్రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ ఎక్కడని అంటున్నారని, అసలు తెలంగాణ అంటే టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అని వ్యాఖ్యానించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని బీజేపీ మోసం చేసిందన్నారు. గొర్రెల పథకంలో ఒక్క రూపాయి కూడా కేంద్రానిది లేదని చెప్పారు. ఉప ఎన్నికలో ఒక్క నాయకుడు కూడా నిజాలు మాట్లాడటం లేదని హరీశ్రావు తప్పుబట్టారు. దుబ్బాక ఉప ఎన్నికను టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మూడు ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఏ పార్టీకి ఆపార్టీ గెలుపు తమదేనని ధీమాగా ఉన్నాయి.