కేసీఆర్ సభ పెట్టకుండా కుట్రలు చేశారు: మంత్రి హరీష్రావు
ABN , First Publish Date - 2021-10-27T23:45:10+05:30 IST
సంక్షేమ పథకాలే తమకు విజయాన్ని అందిస్తాయని మంత్రి హరీష్రావు అన్నారు. కేసీఆర్ సభ పెట్టకుండా కుట్రలు చేశారని ఆరోపించారు.
హుజురాబాద్: సంక్షేమ పథకాలే తమకు విజయాన్ని అందిస్తాయని మంత్రి హరీష్రావు అన్నారు. కేసీఆర్ సభ పెట్టకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. కేసీఆర్పై హుజురాబాద్ ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. 2001 నుంచి ఇక్కడి ప్రజలు కేసీఆర్ను గెలిపిస్తూ వచ్చారని చెప్పారు. ఉపఎన్నిక సర్వేలన్నీ టీఆర్ఎస్కు అనుకూలమని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు ఇప్పటికే ఫ్రస్టేషన్లో ఉన్నారని చెప్పారు. గెలుపు ఖాయం కావడంతో కొత్త కుట్రలకు తెరలేపారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ఓటుకు రూ.20 వేలు ఇస్తోందని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తమ సవాళ్లకు బీజేపీ నేతల దగ్గర సమాధానం లేదన్నారు.