ఈటల ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారు: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-10-17T01:12:39+05:30 IST

ఈటల ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈటలను బీజేపీ ఓన్‌ చేసుకోవడం లేదన్నారు. పెట్రో, గ్యాస్‌ ధరలు ఎందుకు పెరిగాయో ఈటల చెప్పగలరా? అని ప్రశ్నించారు.

ఈటల ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారు: హరీష్‌రావు

హుజురాబాద్: ఈటల ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈటలను బీజేపీ ఓన్‌ చేసుకోవడం లేదన్నారు. పెట్రో, గ్యాస్‌ ధరలు ఎందుకు పెరిగాయో ఈటల చెప్పగలరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెడుతోందన్నారు. దీన్ని ఈటల సమర్థిస్తారో.. లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తారా? అని మంత్రి మండిపడ్డారు. 

Updated Date - 2021-10-17T01:12:39+05:30 IST