గజ్వేల్ ప్రజలను ఉద్దేశిస్తూ హరీశ్ రావు ప్రకటన
ABN , First Publish Date - 2020-04-02T19:10:13+05:30 IST
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గజ్వేల్: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలా అయితేనే ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందన్నారు. ఏప్రిల్ 15 వరకు జాగ్రత్తగా ఉంటూ, తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు. ఎవరింట్లో వారు ఉన్నట్లయితే కుటుంబాన్ని తద్వారా రాష్ట్రాన్ని.. దేశాన్ని కాపాడుకున్న వాళ్లమవుతామన్నారు. గజ్వేల్ పట్టణంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. అధికారులు చేసిన సూచనలు పాటిస్తూ.. ఎవరికైనా జలుబు దగ్గు లాంటివి ఉంటే వైద్యాధికారులను సంప్రదించాలని హరీశ్ రావు సూచించారు.