సొంత జాగాలో ఇళ్లు కట్టిస్తాం: హరీష్రావు
ABN , First Publish Date - 2021-09-05T00:57:24+05:30 IST
రాబోయే రోజుల్లో సొంత జాగాలో ఇళ్లు కట్టించే కార్యక్రమం రాష్ట్రమంతటా ప్రారంభిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు.
హుజూరాబాద్: రాబోయే రోజుల్లో సొంత జాగాలో ఇళ్లు కట్టించే కార్యక్రమం రాష్ట్రమంతటా ప్రారంభిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు 1.25 కోట్ల వడ్డీ లేని రుణాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ ఏడేళ్లు మంత్రిగా ఉన్న వ్యక్తి ఇక్కడ ఒక్క మహిళా సంఘ భవనం కూడా కట్టించలేదని, తన నియోజకవర్గంలో 20 భవనాలు కట్టించానన్నారు. హుజూరాబాద్కు ప్రస్తుతం నాలుగు మహిళా సంఘ భవనాలు మంజూరు చేస్తున్నామని హరీష్రావు తెలిపారు.