కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్‌ ముప్పు అలాగే ఉంది: మంత్రి హరీష్

ABN , First Publish Date - 2022-03-16T21:25:44+05:30 IST

12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ అందించ‌డం సంతోషంగా ఉంద‌ని హరీష్‌రావు అన్నారు.

కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్‌ ముప్పు అలాగే ఉంది: మంత్రి హరీష్

హైదరాబాద్: 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ అందించ‌డం సంతోషంగా ఉంద‌ని మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం ఖైరతాబాద్‌ వెల్‌నెస్‌ సెంటర్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్‌ ముప్పు అలాగే ఉందన్నారు. చైనా, అమెరికా, హాంకాంగ్‌లో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. కరోనా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని సూచించారు. కొత్త వ్యాక్సిన్‌ కోసం ప్రపంచం హైదరాబాద్‌ వైపు చూస్తోందని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు.


Updated Date - 2022-03-16T21:25:44+05:30 IST