కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోంది: మంత్రి హరీష్

ABN , First Publish Date - 2022-03-14T21:54:18+05:30 IST

కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని మంత్రి హరీష్ రావు విమర్శించారు.

కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోంది: మంత్రి హరీష్

హైదరాబాద్: కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఆరేళ్లలో తమ ప్రభుత్వం రాష్ట్రంలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని మంత్రి చెప్పారు. 


భారత దేశంలో 171 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే... తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా ఇవ్వకుండా తీవ్రమైన అన్యాయం చేసిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఒక్కొక్క కాలేజీలకు కేంద్రం రూ. 200 కోట్లు గ్రాంటుగా ఇస్తోందన్నారు. తెలంగాణకు కూడా మంజూరు చేసి ఉంటే కొంత వెసులుబాటు వచ్చేదని, కాలేజీకి రూ. 2 వందల కోట్లు వచ్చేవని అన్నారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపినా కేంద్రం చిన్నచూపుచూసిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Updated Date - 2022-03-14T21:54:18+05:30 IST