పదవి ఉన్నా లేకున్నా నాయకత్వంపై అభిమానం ఉండాలి: Harish
ABN , First Publish Date - 2022-05-08T21:09:13+05:30 IST
పదవి ఉన్నా లేకున్నా నాయకత్వంపై అభిమానం ఉండాలని మంత్రి హరీష్ రావు అన్నారు.
Hyderabad: పదవి ఉన్నా లేకున్నా నాయకత్వంపై అభిమానం ఉండాలని, పదవులు వచ్చిన వారు ప్రజల కోసం పని చేయాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారదులుగా కార్యకర్తలు ఉండాలన్నారు. క్యాడర్ లేకుంటే పార్టీ లేదని.. కార్యకర్తలు పార్టీకి మూల స్తంభాలని అన్నారు. అన్ని పార్టీల నేతలు వచ్చి సిద్దిపేట అభివృద్ధి మీద ఏడుస్తారని, మరి ఇక్కడి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. సిద్దిపేట పదిమందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందని, సిద్దిపేట పేరు లేకుండా కేంద్ర అవార్డులే ఉండవన్నారు. ప్రస్తుతం సిద్దిపేటకు రెండో రింగు రోడ్డు వేస్తున్నామని, భవిష్యత్తులో మూడో రింగు రోడ్డు రాబోతోందని హరీష్ రావు తెలిపారు.