బీజేపీ ఎంపీలకు మంత్రి హరీశ్రావు సవాల్
ABN , First Publish Date - 2022-01-24T00:16:56+05:30 IST
బీజేపీ ఎంపీలకు మంత్రి హరీశ్రావు సవాల్
సంగారెడ్డి: రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి వుంటే దళితబంధును దేశవ్యాప్తంగా అమలు చేయించాలని మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితబంధు కార్యక్రమాన్ని అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటప్రకారం దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అంచెలంచెలుగా అమలు చేస్తామన్నారు. దళితబంధు మనఊరు, మనబడి అమలును జీర్ణించుకోలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అవాక్కులు, చవాక్కులు పలుకుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను ఆదర్శంగా తీసుకొని కేంద్రప్రభుత్వం సంక్షేమ పథకాలను చేపడుతున్న విషయాన్ని బీజేపీ ఎంపీలు గుర్తించాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథను దేశవ్యాప్తంగా హర్ ఘర్ జల్పేరుతో, రైతుబంధును కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని హరీశ్రావు తెలిపారు.