హరిక్రిష్ణ మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-05-13T05:30:00+05:30 IST

ఎర్రకుంట నుంచి హరిక్రిష్ణ మృతదేహం గురువారం లభ్యమైంది.

హరిక్రిష్ణ మృతదేహం లభ్యం
హరికృష్ణ మృతదేహం

లింగాల, మే 13: ఎర్రకుంట నుంచి హరిక్రిష్ణ మృతదేహం గురువారం లభ్యమైంది. బుధవారం మధ్యా హ్నం లింగాల కుడికాల్వ పక్కన ఎర్రకుంటలో హరికృష్ణ ఈతకు వెళ్లి గల్లంతైన విష యం తెలిసిందే. దీంతో అతని మృత దేహాన్ని బయటకు తీసేందుకు బుధ వారం రాత్రి మైలవరం నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేప ట్టారు. అయితే రాత్రి 11గంటల నుంచి గాలి వాన మొదలవడంతో వెతుకులాట నిలిపేశారు. గురువారం ఉదయం నుంచి అగ్ని మాపక సిబ్బంది గజ ఈతగాళ్లు మృతదేహం కోసం గాలించగా 12 గంటలకు నీటి నుంచి మృతదేహం పైకి తేలింది. దీంతో మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష కోసం పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ హాజీవలి తెలిపారు.


Updated Date - 2021-05-13T05:30:00+05:30 IST