హరిద్వార్ కుంభమేళాకు ప్రత్యేక పాసులు : సీఎం రావత్

ABN , First Publish Date - 2020-09-18T21:29:48+05:30 IST

కరోనా కారణంగా 2021 హరిద్వార్ కుంభమేళా పూర్తి ఆంక్షల మధ్య కొనసాగుతుందని ముఖ్యమంత్రి త్రివేంద్ర

హరిద్వార్ కుంభమేళాకు ప్రత్యేక పాసులు : సీఎం రావత్

న్యూఢిల్లీ : కరోనా కారణంగా 2021 హరిద్వార్ కుంభమేళా పూర్తి ఆంక్షల మధ్య కొనసాగుతుందని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. కుంభమేళాకు అతి కొద్ది మంది భక్తులనే తాము అనుమతిస్తామని స్పష్టం చేశారు. కుంభమేళాకు వచ్చే భక్తులకు ప్రత్యేకమైన పాసులను జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.


కరోనా కారణంగా కుంభమేళాను తక్కువ స్థాయిలో నిర్వహించాలని తాము ప్రతిపాదించామని, ఈ విషయాన్ని పీఠాధిపతులకు, స్వామీజీలకు ఇప్పటికే తాము నివేదించామని అన్నారు. కుంభమేళాకు వచ్చే భక్తులకు ఇలా ప్రత్యేక పాసులు జారీ చేయడం కుంభమేళా చరిత్రలో ఇదే ప్రథమమని త్రివేంద్ర సింగ్  పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-18T21:29:48+05:30 IST